యంగ్ డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ టీజర్ దుమ్ము రేపుతోంది. ప్రత్యేకించి రణ బీర్ కపూర్ , అనిల్ కపూర్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక రష్మిక మందన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
వంగా టేకింగ్ అదుర్స్ అనిపించేలా ఉంది. యానిమల్ చిత్రాన్ని ఎలాగైనా సరే డిసెంబర్ 1న విడుదల చేయాలని మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఆ మేరకు షూటింగ్ కూడా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి.
తాజాగా టీజర్ మాత్రం మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉందని అంటున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా భారీగా స్పందించారు. తమ అభిమాన నటుల నటనను చూసి విస్తు పోతున్నారు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు వంగాకు దక్కుతుందని కితాబు ఇస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే యానిమల్ మూవీ తండ్రీ, కొడుకుల మధ్య జరిగే పోరాటంగా కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. ఇద్దరి మధ్య దూరం ఉన్నప్పటికీ చివరకు తను ప్రేమించే రష్మికతో తనను ఏమైనా అను కానీ తన తండ్రిని ఏమైనా అంటే ఊరుకోనంటూ రణ బీర్ కపూర్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచేలా ఉంది. మొత్తంగా యానిమల్ సినిమా పిచ్చెక్కించేలా ఉంటుందని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.