ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ హరిత విప్లవానికి బ్లూ ప్రింట్

స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్

అనంత‌పురం జిల్లా – ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ హరిత విప్లవానికి బ్లూ ప్రింట్ గా మార‌నుంద‌ని అన్నారు మంత్రి నారా లోకేష్‌. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ప్రతి మెగావాట్ విద్యుత్ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుందన్నారు. భారతదేశాన్ని ముందుండి నడిపించే శక్తి రథానికి ఆంధ్రప్రదేశ్ సారధ్యం వహిస్తుందన్నారు. భారతదేశంలో గ్రీన్ పవర్ హౌస్ గా మారుతున్న ఆంధ్రప్రదేశ్ పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన రెన్యూ చైర్మన్, సిఇఓ సుమంత్ సిన్హా, సంస్థ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు .

రెన్యూ పవర్ ఇక్కడ ఏర్పాటు చేసే భారీ ప్రాజెక్టు మపాలనా సామర్థ్యాన్ని ప్రతిబింబించడమే గాక భవిష్యత్ పై నమ్మకానికి వెలుగురేఖగా నిలుస్తుందన్నారు. ఆరేళ్ల తర్వాత రెన్యూ గతంకంటే మెరుగ్గా ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చిందన్నారు. ఈ విప్లవాత్మక మార్పు వెనుక ఒక దార్శనికుడు ఉన్నాడని,. ఆయన రేపటి గురించే కాకుండా రాబోయే దశాబ్ధాల గురించి కూడా ముందుగా ఆలోచిస్తాడని అన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాలను మాత్రమే నిర్మించడం లేదన్నారు. రేపటితరం భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని తెలిపారు.

ఇతరులు పాలసీలు చూసిన చోట ఆయన అవకాశాలను చూశారన్నారు. ఆ దార్శనికుడి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ట్రెండ్ ను ఫాలో కావడం లేదు, ట్రెండ్ సెట్ చేస్తోంద‌న్నారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలో అక్టోబర్, 2024లో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ కీల‌కంగా మార బోతోంద‌న్నారు. ఏపీ అయిదేళ్ల విరామం తర్వాత సమర్థవంతమైన పనితీరుకు ప్రతీకగా రూపాంతరం చెందుతోందన్నారు. 2029 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలన్న మా సాహసోపేతమైన లక్ష్యం అత్యవసరమైందని స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com