యోగా డే అద్భుతం విశాఖ న‌గ‌రం సంచ‌ల‌నం

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

యోగా డే నిర్వ‌హ‌ణ గ్రాండ్ స‌క్సెస్ కావ‌డం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు ఆనందం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మం గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డ్ లో చోటు ద‌క్కించుకుంది. 3 ల‌క్ష‌ల మంది యోగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్ని విభాగాల సమన్వయంతో యోగా డే విజ‌య‌వంత‌మైంద‌ని అన్నారు. పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రినీ అభినందించారు సీఎం. రాబోయే రోజుల్లో యోగాంధ్ర నిత్యం కొన‌సాగాల‌న్నారు.

శ‌నివారం యోగా డే నిర్వహణ, గ్రాండ్ సక్సస్ పై సిఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేప‌ట్టారు.
విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులుతో స‌మావేశం నిర్వ‌హించారు. విశాఖతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన తీరుపై చర్చించారు. పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సిఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. మీరు చేసిన స‌హ‌కారం వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌న్నారు.

సమావేశ మందిరంలోకి సిఎం చంద్రబాబుకు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు మంత్రులు, అధికారులు. యోగా డే అద్భుతంగా స‌క్సెస్ అయ్యింద‌న్నారు. త‌న జీవితంలో మ‌రిచి పోలేని రీతిలో జ‌రిగింద‌ని ఇదంతా మీ వ‌ల్లే సాధ్య‌మైంద‌న్నారు. మంచి కార్యక్రమంలో ఇదో గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు నారా చంద్ర‌బాబు నాయుడు. అర్థరాత్రి 2 గంటల నుంచే ప్రజలు తరలి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింద‌న్నారు. ర్యాలీలో పాల్గొన్న వారి లెక్కింపులో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ విధానం అద్భుతంగా ప‌ని చేసింద‌ని చెప్పారు సీఎం.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com