అమరావతి – ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ మొదటి దశ జూన్ 24న ప్రారంభం కానుంది, ఇది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అంతటా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ ప్రక్రియ జూన్ 28వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రకటించింది. ఈ సందర్బంగా అభ్యర్థులు తమ ప్రాథమిక వివరాలను ఆన్ లైన్ లో సమర్పించాలి. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం తేదీ, సమయం స్లాట్ను ఎంచుకోవాలి. ఇక తాత్కాలిక సీట్ల కేటాయింపును జూలై 4వ తేదీ వరకు ఖరారు చేసి పూర్తి జాబితాను వెల్లడిస్తారు.
ఇక కౌన్సెలింగ్ చివరి దశ జూలై 9 వరకు ప్రారంభం అవుతుంది. అన్నీ పూర్తయ్యాక విద్యా తరగతులు జూలై 18 నుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇక పాలిసెట్ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో విజయవంతంగా అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు అర్హులవుతారు. రుసుము పరంగా చూస్తే. ఇతర కేటగిరీ (OC), వెనుకబడిన తరగతుల (BC) కోసం రూ 700 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ తెగల అభ్యర్థులు రూ. 250 కట్టాలి.
అభ్యర్థులు ధృవీకరణ కోసం ఈ క్రింది పత్రాలను తీసుకెళ్లాల్సి ఉంఉంది. ఏపీ పాలిసెట్ 2025 హాల్ టికెట్, ర్యాంకు కార్డు, పదవ తరగతి మార్క్ షీట్, సర్టిఫికెట్, బోనఫైడ్స్, క్యాస్ట్ , లోకల్ , టీసీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం ( ఇది జనవరి 1వ తేదీ తర్వాత జారీ చేయబడినదై ఉండాలి) సమర్పించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆధార్ కార్డు, 4 నుంచి 10వ తరగతి వరకు చదివిన స్కూల్ బోన పైడ్స్ , మైనార్టీ సర్టిఫికెట్ ఉంటే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అన్ని సర్టిఫికెట్లు, ఫోటోలను దగ్గర ఉంచుకోవాలి. జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా ఉండాలి.