స‌మంత చైతూ తిరిగి క‌లుస్తున్నారా..?

సంచ‌ల‌నంగా మారిన ఇద్ద‌రి వ్య‌వ‌హారం

సినిమా రంగంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. దీనికి కార‌ణం ఇక్క‌డ శాశ్వ‌త‌మైన అనుబంధాలు, స్నేహాలు ఉండ‌వు. తాజాగా విడి పోయిన జంట తిరిగి ఓ కార్య‌క్ర‌మంలో క‌లుసుకో బోతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్ గా మారింది. ఆ ఇద్ద‌రు ఎవ‌రో కారు ఇప్ప‌టికే న‌టీ న‌టులుగా ప్రాచుర్యం పొందిన వారే. ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని చివ‌ర‌కు విడాకులు పుచ్చుకున్న ఆ జంటనే స‌మంత రుత్ ప్ర‌భు, అక్కినేని నాగ చైత‌న్య‌.

ఇదిలా ఉండ‌గా ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌ముఖ త‌మిళ సినీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ద‌ర్‌శ‌క‌త్వం వ‌హించిన ఏమాయ చేశావే చిత్రంలో ప‌రిచ‌యం చేశాడు. ఈ సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఇందులో ఇద్ద‌రినీ అద్భుతంగా చిత్రీక‌రించాడు. ప్ర‌ధానంగా దేశ వ్యాప్తంగా యువ‌త హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. మంచి ఆద‌ర‌ణ చూర‌గొంది. పెద్ద ఎత్తున క‌లెక్ష‌న్స్ సాధించింది. ఈ ఒక్క మూవీతో స్టార్ డ‌మ్ వ‌చ్చేలా చేసింది స‌మంత‌కు.

ఆ త‌ర్వాత త‌మిళం, తెలుగు, హిందీల‌లో ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా వెబ్ సీరీస్ లో త‌ళుక్కున మెరిసింది. త‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ , నాగ చైత‌న్య ల‌తో క‌లిసి న‌టించింది. మెప్పించింది కూడా. ఇదే స‌మ‌యంలో పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోయారు. ఆ త‌ర్వాత ఇరు కుటుంబాలు స‌మ్మ‌తించడంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. చివ‌ర‌కు విడి పోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంద‌రినీ విస్తు పోయేలా చేశారు. త‌ను ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ రాజ్ నిడిమూరుతో తిరుగుతోంది..ఇక చైతూ శోభిత‌ను పెళ్లి చేసుకున్నాడు.

ఇక తాజాగా విడి పోయిన ఈ ఇద్ద‌రు త్వ‌ర‌లో క‌లుసుకో బోతున్నార‌ని పెద్ద ఎత్తున టాలీవుడ్ లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఏదైనా ఈవెంటా లేక ఇంకేమైనా ఉందా అని ఉత్కంఠ నెల‌కొంది .

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com