ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిట్ చాట్ సందర్బంగా తను చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ దేశంలో క్రికెట్ పరంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారని అన్నాడు. ఇందుకు సంబంధించి తాను బీసీసీఐని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పాడు. పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని, అయితే విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లకు ఇండియాలో కొదవే లేదన్నాడు.
అయితే వెన్నుతట్టి సపోర్ట్ చేస్తే మెరికల్లాంటి కుర్రాళ్లు బయటకు వస్తారని అన్నాడు. ఇక భారత జట్టుకు ఎనలేని విజయాలు అందించిన అజారుద్దీన్ అద్భుతమైన ఆటగాడు అంటూ కితాబు ఇచ్చాడు. తనతో రాజకీయ పరంగా విభేదాలు ఉన్నప్పటికీ తన ఆట తీరు మాత్రం సింప్లీ సూపర్ అన్నాడు. ప్రపంచ క్రికెట్ లో జహీర్ అబ్బాస్, డేవిడ్ గోవర్ తర్వాత వరల్డ్ క్రికెట్ లో ఫ్లిక్ షాట్స్ ను ఆడడంలో ఇప్పటి వరకు అజారుద్దీన్ లాంటి క్రికెటర్ ను తాను చూడలేదని అన్నారు.
తను మైదానంలో కదిలే విదానం, ఫీల్డింగ్ చేసే పద్దతి గురించి ఎంత చెప్పినా తక్కువేనని కొనియాడారు అసదుద్దీన్ ఓవైసీ. తాను కూడా చదువుకునే రోజుల్లో క్రికెట్ ఆడానని, కానీ ఇప్పుడు ఆడలేనంటూ పేర్కొన్నాడు. ఇదే సమయంలో తనను డెలిగేషన్ టీమ్ లో చేర్చడం పట్ల స్పందించాడు ఓవైసీ. పాకిస్తాన్ కు బుద్ది లేదన్నాడు. తను చేస్తున్న దాడుల గురించి ప్రపంచానికి తెలియ చేస్తానని ప్రకటించాడు.