చంద్ర‌బాబూ ఇక పాలించింది చాలు

ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ కామెంట్స్

హైద‌రాబాద్ – ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడును టార్గెట్ చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ఉచిత స‌ల‌హా ఇచ్చారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడారు ఓవైసీ. త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట‌కు చెప్పేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది రాజ‌కీయాల‌లో. నారా లోకేష్ కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని, 14 ఏళ్లు పాలించావు ఇక చాలు అని హిత‌వు ప‌లికారు.

లోకేష్ భవిష్యత్తును నాశనం చేయొద్దంటూ నారా చంద్ర‌బాబు నాయుడుకు అస‌దుద్దీన్ ఓవైసీ సూచించారు. ఎలాగూ మీరు జూనియ‌ర్ ఎన్టీఆర్ కు పార్టీ ప‌గ్గాలు ఇవ్వ‌రంటూ ఎద్దేవా చేశారు. రాజ‌కీయ ప‌రంగా అనుభ‌వం ఉండ‌డం వేర‌ని, ఇక కొత్త త‌రానికి ఛాన్స్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వ‌య‌సు రీత్యా హాయిగా లైఫ్ గ‌డిపితే బావుంటుంద‌ని పేర్కొన్నారు ఓవైసీ.

ఇదిలా ఉండ‌గా ఎందుక‌ని ఓవైసీ ఇలాంటి కామెంట్స్ చేశార‌నే దానిపై రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చోప చ‌ర్చ‌లు చేస్తున్నాయి. ఏది ఏమైనా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత తెలంగాణ ఏర్పాటుతో ఏపీకి వెళ్లి పోయారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com