పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో నటించిన చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ఖర్చు చేశారు సినీ నిర్మాత ఎంఎం రత్నం. ఆయనకు పవన్ కళ్యాణ్ తో సన్నిహిత పరిచయం ఉంది. అంతకు మించి రెట్టించిన అభిమానం కూడా. అందుకే ఆలస్యమైనా అద్భుతంగా తీసేలా చూశారు. అన్నీ తానైన రత్నం భారతీయ సినీ చరిత్రలో ఓ మైలు రాయి లాగా మిగిలి పోతుందని ఈ సినిమా అంటూ పేర్కొన్నాడు.
ఇక చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. ఆ మధ్యన భీమ్లా నాయక్ తీశాడు. ఈ ఏడాది మెగా ఫ్యాన్స్ కు పండగేనని చెప్పక తప్పదు. ఎందుకంటే పవర్ స్టార్ కు సంబంధించి రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. ఒకటి హరి హర వీరమల్లు కాగా రెండోది ఓజీ. ఈ రెండింటిచి సంబంధించి రోజుకో అప్ డేట్ వస్తోంది. ఇక హరి హర వీరమల్లును జూన్ 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు ఎంఎం రత్నం.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మూడో పాటను విడుదల చేశారు. అసుర హననం సాంగ్ ను రాంబాబు రాయగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. దీని గురించి పవన్ కళ్యాణ్ కు వినిపించారు. ఈ పాటను విన్న పవర్ స్టార్ ప్రశంసలు కురిపించారు. తాను 50 సార్లకు పైగా విన్నానని చెప్పారు. దీంతో సినిమాపై మరింత హైప్ పెరిగేలా చేసింది. కీరవాణి స్టూడియోను సందర్శించారు. రచయిత, మ్యూజిక్ డైరెక్టర్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు.