AUS Cricket Board : ఆస్ట్రేలియా – మెగా ఐపీఎల్ 2025 ను నిర్వహిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ లో భాగస్వామ్యం వహిస్తున్నారు. ఐపీఎల్ అనేది స్వదేశీ, విదేశీ ఆటగాళ్ల కలయిక. ఇక టోర్నీలో భాగంగా బీసీసీఐ విదేశీ ఆటగాళ్లతో ముందస్తు ఒప్పందం చేసుకుంటుంది. ఇందులో భాగంగా మే 26 వరకు వారితో కాంట్రాక్టు కలిగి ఉంది. మే 26న టోర్నీ ముగియాల్సి ఉండగా ఉన్నట్టుండి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తత కారణంగా నిలిచి పోయింది.
AUS Cricket Board Shocking to BCCI
ఈ సమయంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. దీంతో ఐపీఎల్ టోర్నీని తిరిగి నిర్వహిస్తామని ప్రకటించారు బీసీసీఐ కార్యదర్శి జే షా. దీంతో ఐపీఎల్ లో ఇంకా మిగిలి పోయిన 15 మ్యాచ్ లను తిరిగి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా మార్చేశారు. జూన్ 3న టోర్నీ పూర్తవుతుంది. కాగా విదేశీ ఆటగాళ్ల కాంట్రాక్టు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా క్రికెట్ బోర్డులు బీసీసీఐకి తమ ఆటగాళ్లను వెంటనే పంపించాలని కోరుతున్నాయి.
తాజాగా ఆస్ట్రేలియా(Australia) క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఝలక్ ఇచ్చింది బీసీసీఐకి. ఈ మేరకు తక్షణమే ప్లేయర్లను తమ దేశానికి పంపించాలని, ఉంచుకోవద్దంటూ కోరింది. దీంతో ఇరకాటంలో పడింది మన బోర్డు. ఐసీసీ చైర్మన్ గా ఉన్న జే షా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.
Also Read : Jos Buttler Shocking :మెగా ఐపీఎల్ లో జోస్ బట్లర్ ఆడతాడా..?