ఐసీసీ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది దక్షిణాఫ్రికా. 27 ఏళ్ల సుదీర్ఘ అనంతరం ఆ జట్టు గెలుపొందింది. మ్యాచ్ అనంతరం జట్టు కెప్టెన్ టెంబా బావుమా మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియా జట్టుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ జట్టును నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఆపై చోకర్స్ అంటూ ఎద్దేవా చేశారంటూ వాపోయాడు. మా దృఢ సంకల్పాన్ని నిర్వీర్యం చేసేందుకు చేయాల్సిందంతా ఆ జట్టు చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ స్లెడ్జింగ్ ప్రయత్నాలకు దిగిందంటూ మండిపడ్డాడు. అయినా అన్నింటిని దాటుకుని తాము విజేతగా నిలిచిమన్నాడు. ఇది ఒక్క రోజుతో సాధించింది కాదన్నాడు. చాలా ఏళ్లు పట్టిందన్నాడు. చివరి బంతి వరకు తమను ఇబ్బందికి గురి చేసేందుకు ప్రయత్నం చేశారన్నాడు టెంబా బావుమా.
ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్ల నుండి చోక్ అనే పదాన్ని తాను చాలా సార్లు విన్నానని చెప్పాడు. ఇదిలా ఉండగా చోకర్స్ అనే పదానికి తావు లేదన్నాడు. ఆ మాట ఇక నుంచి వినిపించదన్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేస్తూ పదే పదే హద్దులు దాటిన కారణంగానే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సాంప్రదాయకంగా అనేక వివాదాల్లో భాగమైంది.
పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆధునిక జట్టు చాలా భిన్నంగా ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఈ జట్టు కూడా హద్దులు దాటిందన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు ఆస్ట్రేలియాకు ఝలక్ ఇచ్చాం. ఛాంపియన్లుగా నిలిచామన్నాడు. ఈ గెలుపు మా దేశంలోని ప్రజలందరికీ స్పూర్తిగా నిలుస్తుందన్నాడు.