బీసీసీఐ టాటా ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ మేరకు విడుదల చేసింది. మే 17 నుంచి మ్యాచ్ లు ప్రారంభం అవుతాయి. ఇంకా టోర్నీలో 17 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. మే 29న క్వాలిఫయర్ 1, 30న ఎలిమినేటర్ , జూన్ 1న క్వాలిఫయర్ 2 , జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇక మ్యాచ్ ల పరంగా చూస్తే మే 17న బెంగళూరు వేదికగా బెంగళూరు, కోల్ కతా మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతుంది. 18న జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య, 19న లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతుంది.
మే20న ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ ఎలెవన్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య, 21న ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య, మే 22న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య, మే 23న బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక లీగ్ మ్యాచ్ జరగనుంది.
జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య, అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ , చెన్న సూపర్ కింగ్స్ జట్ల మధ్య, ఢిల్లీ వేదికగా మే 25న హైదరాబాద్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. జైపూర్ వేదికగా మే26న పంజాబ్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య, లక్నో వేదికగా 27న లక్నో, బెంగళూరు జట్ల మధ్య కీలక పోరు కొనసాగనుంది.
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ మే 29న, ఎలిమినేటర్ మ్యాచ్ మే 30న , రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జూన్ 1న, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.