టి20 వరల్డ్ కప్ ను భారత్ చేజిక్కించు కోవడంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ఇంగ్లాండ్ సీరీస్ లో ఆడనున్నాడు. ఈ మేరకు టెస్టు ఫార్మాట్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించనుంది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్. ఆయనతో పాటు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పాల్గొంటాడు. మరో వైపు టెస్టు జట్టుకు ఇటీవలే స్కిప్పర్ ను ఖరారు చేసింది. అయితే ఇంగ్లండ్ సీరీస్ కు ఎవరు ఉంటారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై ఉత్కంఠ నెలకొంది.
మరో వైపు ఐపీఎల్ 2025 ఆఖరు దశకు చేరుకుంది. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఆరు జట్లు తిరుగు ముఖం పట్టాయి. ఈ తరుణంలో కోచ్ మాత్రం మూడు ఫార్మాట్ లకు వేర్వేరుగా జట్లను ఎంపిక చేయాలని ముందు నుంచీ చెబుతూ వస్తున్నాడు. ఆ దిశగా పావులు కదుపుతున్నాడు. గతంలో హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కు గంభీర్ కు చాలా తేడా ఉంది. ద్రవిడ్ పూర్తిగా కొత్తగా యంగ్ క్రికెటర్లను సాన బెట్టే ఆలోచనలో ఉంటే గౌతమ్ మాత్రం పూర్తిగా పర్ ఫార్మెన్స్ ఆధారంగా జట్టులోకి ఆటగాళ్లను తీసుకుంటున్నాడు.
ఇందుకు ఉదాహరణ ద్రవిడ్ సమయంలో పక్కన పెట్టిన సంజూ శాంసన్ కు ప్రమోషన్ ఇచ్చాడు గంభీర్. అంతే కాదు టి20 ఫార్మాట్ లో తనను ఓపెనర్ గా పంపించాడు. తను సక్సెస్ అయ్యాడు కూడా. ఇక ఈసారి ఐపీఎల్ లో తళుక్కున మెరిశాడు బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. మరి అర్ష్ దీప్ తో పాటు ఇంకెవరిని ఎంపిక చేస్తారనే ది ఇవాళ్టితో తేలి పోనుంది.