శుభ్ మ‌న్ గిల్ కు బీసీసీఐ బంప‌ర్ ఆఫ‌ర్

టెస్టు క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ గా ఎంపిక

బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు యంగ్ క్రికెట‌ర్ శుభ్ మ‌న్ గిల్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. భార‌త జ‌ట్టు టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు త‌న‌ను స్కిప్ప‌ర్ గా ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఐపీఎల్ లో గుజ‌రాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఉన్న గిల్ త‌న జ‌ట్టును విజ‌య‌వంతంగా న‌డిపిస్తున్నాడు. దీంతో త‌న వైపే బీసీసీఐ ఎంపిక క‌మిటీ మొగ్గు చూప‌డం విశేషం.

క్రికెట్ ప‌రంగా చూస్తే త‌ను అత్యంత పిన్న వ‌య‌సులో కెప్టెన్ గా ఎంపిక కావ‌డం. గ‌తంలో న‌లుగురు ప్రాతినిధ్యం వ‌హించ‌గా ఇప్పుడు శుభ్ మ‌న్ గిల్ ఐదో ఆట‌గాడు కావ‌డం విశేషం. ఇంగ్లండ్ తో జ‌రిగే భార‌త టెస్టు సీరీస్ కు త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తాడ‌ని పేర్కొన్నాడు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్. జ‌ట్టు కూర్పుపై కూడా మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు. అనూహ్యంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ఎంపిక చేయ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం అవుతోంది.

కాగా యంగ్ క్రికెట‌ర్లు సాయి సుద‌ర్శ‌న్, అర్ష్ దీప్ సింగ్ ల‌కు చోటు ద‌క్కింది భార‌త జ‌ట్టులో. విచిత్రం ఏమిటంటే ఐపీఎల్ లో తీవ్ర నిరాశ ప‌ర్చిన రిష‌బ్ పంత్ కు వైస్ కెప్టెన్సీని అప్ప‌గించింది. బుమ్రాను ప‌క్క‌న పెట్టింది. ష‌మీ, స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను ప‌క్క‌న పెట్టేసింది. క‌రుణ్ నాయ‌ర్ కు ఛాన్స్ ఇచ్చారు.

జట్టు ప‌రంగా చూస్తే గిల్‌(కెప్టెన్‌), పంత్‌(వైస్‌ కెప్టెన్‌), జైస్వాల్‌, రాహుల్‌, సుదర్శన్‌, ఈశ్వరన్‌, కరుణ్‌ నాయర్‌, నితీశ్‌రెడ్డి, జడేజా, జురెల్‌, సుందర్‌, శార్దుల్‌, బుమ్రా, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, కుల్దీప్‌యాదవ్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com