సినిమా రంగంలో ఎవరు ఎప్పుడు ఎలా పైకి వస్తారో ఎలా కనుమరుగై పోతారో ఎవరూ చెప్పలేరు. అందుకే దీనిని రంగుల లోకం అంటారు. ఒక్కోసారి సక్సెస్ వచ్చినట్టే వస్తుంది. ఆ తర్వాత ఊరించి ఊసురుమనిపిస్తుంది. ఈ సమయంలోనే తట్టుకుని నిలబడ్డ వారే స్టార్లుగా ఎదుగుతారు. ఆ తర్వాత తమను తాము ప్రూవ్ చేసుకుంటారు. అలాంటి కోవలోకి వస్తోంది లవ్లీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. కళ్లతోనే కాటే్స్తోంది. అందంతో కట్టి పడేస్తోంది. అభినయంతో ఆహ్లాదం కలిగించేలా చేస్తోంది.
విచిత్రం ఏమిటంటే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఇక ఆ నటీ నటుల గురించి ఎవరూ కన్నెత్తి చూడరు. దర్శక, నిర్మాతలు ముఖం చాటేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ నటి విషయంలో జరగడం విశేషం. తనను ఏరికోరి తీసుకున్నాడు మాటల మాంత్రికుడు, డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్. తను పవన్ కళ్యాణ్ కు స్టార్ డమ్ మరింత ఎదిగేలా చేశాడు ఒకే ఒక్క సినిమా గబ్బర్ సింగ్ తో. ఇదే సమయంలో తను మాస్ మహారాజా రవితేజతో భాగ్యశ్రీ బోర్సేతో కలిపి మిస్టర్ బచ్చన్ తీశాడు.
ఇందులో మంచి మార్కులు పడ్డాయి. కానీ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఆ తర్వాత తనకు ఛాన్స్ లు రావని అందరూ అనుకున్నారు. కానీ వరుసగా సినిమాలలో నటించేందుకు సిద్దమైంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే రౌడీ విజయ్ దేవరకొండతో నటించిన కింగ్ డమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రా కింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. ఇందులో రామ్ పోతినేని నటిస్తున్నాడు. ఇంకో మూవీకి సంతకం చేసింది. ఆ సినిమా రౌడీ జనార్దన్. దీనిని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
రానా, దుల్కర్ సల్మాన్ తో కలిసి ఇంకో మూవీలో నటించేందుకు సంతకం చేసింది. సో తను బిజీ అన్నమాట.