Operation Sindoor Sensational : పాకిస్తాన్ కు షాక్ ఆప‌రేష‌న్ సింధూర్ అటాక్

వార్ రూమ్ లో ప్ర‌ధాని మోదీ స్వ‌యంగా ఆరా

Operation Sindoor

Operation Sindoor : ఢిల్లీ – జ‌మ్మూ కాశ్మీర్ లోని ప‌హ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా భార‌త్ యుద్దం ప్ర‌క‌టించింది. ఉగ్ర‌వాదుల‌ను టార్గెట్ చేసింది. ఇవాళ అర్ధ‌రాత్రి నుంచి దాడుల‌కు దిగింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆప‌రేష‌న్ సింధూర్(Operation Sindoor) పేరుతో శ్రీ‌కారం చుట్టింది. ఉగ్ర స్థావ‌రాల‌ను టార్గెట్ గా మ‌ట్టు పెట్టింది. దీంతో పాకిస్తాన్ అల‌ర్ట్ అయ్యింది. ఎమర్జెన్సీ ప్ర‌క‌టించింది. ఈ మొత్తం దాడుల‌కు సంబంధించి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. వార్ రూమ్ నుంచి ఆరా తీస్తున్నారు. ఇప్ప‌టికే భార‌త త్రివిధ ద‌ళాలు మూకుమ్మ‌డిగా దాడికి ప్ర‌తీకారం తీర్చుకున్నారు.

Operation Sindoor on Pakistan

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ లో చోటు చేసుకున్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై అటాక్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు దాదాపు 30 ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకున్న‌ట్లు స‌మాచారం. భార‌త దేశ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ ఆప‌రేష‌న్ సింధూరు రూపు దిద్దుకుంది. ఈ సంద‌ర్బంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడారు దోవ‌ల్. భార‌త్ దాడి చేసిన విష‌యాన్ని స్వ‌యంగా వివ‌రించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు.

ఉగ్ర‌వాదం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మ‌రో వైపు భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ పై స్పందించారు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ . భార‌త్ చేస్తున్న దాడులకు ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మెరుపు దాడులు స‌రైన‌వేనంటూ పేర్కొన్నారు. పాకిస్తాన్ సాధ్య‌మైనంత మేర చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని సూచించారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో. ఉగ్ర‌వాదుల‌ను ఏరి పారేస్తామ‌ని, ఎక్క‌డున్నా ప‌ట్టుకుని తీరుతామ‌ని ప్ర‌క‌టించారు ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.

Also Read : Hero Naga Chaitanya :తండ్రి కాబోతున్న అక్కినేని నాగ‌చైత‌న్య‌..?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com