హైదరాబాద్ లోని చేవెళ్ల ప్రాంతంలోని రిసార్ట్ లో సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ కలకలం రేపింది. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం. పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేపట్టారు. పార్టీలో పెద్ద ఎత్తున గంజాయి, విదేశీ మద్యం దొరకడంతో అందరూ విస్తు పోయారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇందులో మంగ్లీతో పాటు కుటుంబీకులు, గేయ రచయిత కాసర్ల శ్యామ్ తో పాటు పలువురు ఉన్నట్లు టాక్. ఇందులో జబర్దస్త్ ఫేమ్ రచ్చరవి కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇదే పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది బిగ్ బాస్ ఫేమ్ దివి వైధ్య అని టాక్. దీనిపై తీవ్రంగా స్పందించింది నటి.
తనకు సింగర్ మంగ్లీతో ఏం సంబంధం అంటూ ప్రశ్నించింది అమాయకంగా. తనకు ఏ పాపం తెలియదని తెలిపింది. తన గురించి నెగటివ్ వార్తలు రాస్తూ డ్యామేజ్ చేస్తున్నారంటూ వాపోయింది. తాను పద్దతిగా ఉంటానని, కేవలం నటనపైనే ఫోకస్ పెడుతున్నట్లు చెప్పింది. ఈ పార్టీతో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని పేర్కొంది. తాను పూర్తిగా అమాయకురాలినని తెలిపింది. తన ఫోటోలను కావాలని వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. ప్రస్తుతం తన కెరీర్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని, ఈ సమయంలో తన గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఎలా అని ప్రశ్నించింది.
ఏదైనా రాసేటప్పుడు ప్రచురించే టప్పుడు, రాసేటప్పుడు ముందు వెనుకా ఆలోచించి రాయాలని కోరింది దివి వైద్య. మొత్తంగా ఆ పార్టీ ఏమిటో, గంజాయి, విదేశీ మద్యం గురించి తనకు ఏ మాత్రం తెలియదని చెప్పుకొచ్చింది.