డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ కు అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫిలిం అవార్డులను ఖరారు చేసింది. మొత్తం 30 సినిమాలను ఎంపిక చేసింది. వీటితో పాటు ఆరు స్పెషల్ జ్యూరీ పురస్కారాలను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన స్పెషల్ అవార్డును నందమూరి బాలకృష్ణను ఎంపిక చేయగా , పైడి జయరాజ్ ఫిలిం అవార్డును మణిరత్నంను ఖరారు చేసింది.
ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన బీఎన్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారానికి దమ్మున్న దర్శకుడు సుకుమార్ ను ఎంపిక చేసింది. ఇక సుకుమార్ తొలి చిత్రం ఆర్య. బన్నీతో తీశాడు. అది హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆర్య 2 తీశాడు. మహేష్ బాబుతో నేనొక్కడినే తీశాడు. మిశ్రమ స్పందన వచ్చింది. రామ్ చరణ్ తో రంగస్థలం తీశాడు అది సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక భారతీయ సినిమా చరిత్రలోనే తను తీసిన ఒకే ఒక్క మూవీతో రికార్డుల మోత మోగించాడు. అల్లు అర్జున్ , రష్మిక మందన్నాతో కలిసి పుష్ప -1 తీశాడు. కోట్లు కొల్లగొట్టింది. దీనికి సీక్వెల్ గా పుష్ప -2 తీశాడు. ఇది రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఏకంగా రూ. 1867 కోట్లు వసూలు చేసింది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో మరో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు.