హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు సీహెచ్ ప్రియాంక. తాజాగా ఇదే పోస్టులో పని చేసిన డాక్టర్ హరీశ్ ను జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేసింది. ఇప్పటి వరకు ప్రియాంక మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న ప్రియాంకకు పదోన్నతిపై ఐ అండ్ పీఆర్ శాఖకు మార్చారు. ఇప్పటికే సీఎం సీపీఆర్ఓ గా డాక్టర్ మల్సూర్ ను నియమించారు . ఆయనపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఏపీలో పలు పదవులు చేపట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పని చేశారు. ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఆ వెంటనే 15 రోజులు కూడా పూర్తి కాలేదు సీఎం రేవంత్ రెడ్డి ఏరికోరి తనను చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా నియమించారు.
దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సీఎంకు చీఫ్ పీఆర్ ఓగా జర్నలిజం, మీడియా రంగాలలో అనుభవం కలిగిన వారికి ఇచ్చే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఈ తరుణంలో సీహెచ్ ప్రియాంకకు ఐ అండ్ పీఆర్ కు మార్చారు. సోమవారం ఉదయం సచివాలయంలో డా, హరీష్ నుండి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ తోపాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. గా భాద్యతలను స్వీకరించారు.
స్పెషల్ కమీషనర్ గా భద్యతలు స్వీకరించిన ప్రియాంక కు సమాచార శాఖ, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అదే విధంగా జెన్కో ఎం.డి గా వెళ్లిన డా. హరీష్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. స్పెషల్ కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు.