అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కావాలని ఐటీ రంగాన్ని ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, వాటి ఫలితంగా దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. 1995లో సాంకేతిక విప్లవం వచ్చిందని, ఇది తనను మరింత ఈ రంగంపై ఫోకస్ పెట్టేలా చేసిందన్నారు. ఆనాటి నుంచి నేటి దాకా తాను ఐటీని విడువ లేదన్నారు. యావత్ ప్రపంచం ప్రస్తుతం ఈ సెక్టార్ పైనే ఆధారపడి ఉందన్నారు.
ఆనాటి పీఎం నరసింహారావు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని చెప్పారు సీఎం. సంస్కరణలు రాకుండా ఉంటే కొత్త ఆలోచనలు వచ్చేవి కావని అన్నారు. ఈ సాంకేతికతను అందిపుచ్చుకుని భారతీయులు ఎదిగారని అన్నారు రాజకీయ నేతగా అప్పుడు, ఇప్పుడూ సాంకేతిక పరిజ్ఞాన్ని ప్రోత్సహించడంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్ఆనరు.
టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో ప్రధాని మోదీని మించినవారు లేరన్నారు. ఏఐ, క్వాంటమ్ వ్యాలీ అంటే చాలామందికి అర్థం కావడం లేదన్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న భారత సంతతి వారే తలసరి ఆదాయంలో ఆయా దేశాల వారికంటే ముందున్నారని గుర్తు చేశారు. మంచి విజ్ఞానం, ఆలోచనలు ఉన్న అధికారులు సాంకేతికతను కూడా అందిపుచ్చుకుంటే మంచి ఫలితాలు సాధించొచ్చని ముఖ్యమంత్రి అన్నారు.
విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజలందరి సెంటిమెంట్ అని దానిని కూటమి ప్రభుత్వం కాపాడిందని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే విశాఖ రైల్వే జోన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పోలవరం పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని .చెప్పారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా ఉండేలా అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని స్పష్టం చేశారు.