తమిళ సినీ రంగంలో అత్యంత జనాదరణ పొందిన నటులలో చియాన్ విక్రమ్ ఒకడు. తనకు ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగి పోవడం, వంద శాతం పర్ఫార్మెన్స్ ఇవ్వడం అలవాటు. ఇటీవలే తను నటించిన చిత్రం తంగలాన్. దీనిని అద్భుతంగా తెర కెక్కించాడు యంగ్ డైరెక్టర్ పా రంజిత్. తనకు సామాజిక బాధ్యత ఉందని నమ్ముతాడు. తన లోకం సినిమానే. దాని ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలని అనుకుంటాడు.
తాను తీసిన తంగలాన్ విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ చూరగొంది. ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా కలెక్షన్స్ రాక పోవచ్చు గాక. కానీ సినిమా మాత్రం ఆలోచించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
తనలోని టాలెంట్ ను గుర్తించిన సూపర్ స్టార్ నటుడు, తలైవా రజనీకాంత్ ఏకంగా పా రంజిత్ తో రెండు సినిమాలు తీశాడు. ఇక చియాన్ విక్రమ్ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో. భారతీయ సినిమాను తన వైపు తిప్పుకునేలా చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న. తను ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 29 మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.
ఈ సినిమాలో నటించేందుకు చియాన్ ను సంప్రదించారని, ఇందులో నెగటివ్ షేడ్ కలిగిన రోల్ ఉండడంతో విక్రమ్ సున్నితంగా తిరస్కరించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎవరైనా చిన్న పాత్ర దక్కితే చాలు జక్కన్నతో సినిమాలో నటించాలని కోరుకుంటారు. కానీ విక్రమ్ మాత్రం వదులు కోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.