అమరావతి – మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తన వల్లనే హైదరాబాద్ అభివృద్ది చెందిందని, లేక పోతే ఎక్కడో ఉండేదన్నారు. ఆయన పదే పదే తెలంగాణ గురించి ఈమధ్యన ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. దీనిపై తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలియ చేస్తున్నారు. కానీ మానుకోవడం లేదు. ఒక వర్గం మీడియా తనను ప్రమోట్ చేస్తూ వస్తోంది. ఆయన వల్లనే ఏపీ అభివృద్ది సాధిస్తోందని లేక పోతే ప్రజలు నిరాశ్రయులుగా మారే వారంటూ బాకాలు ఊదుతోంది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు తన మనసంతా హైదరాబాద్ పై పెట్టుకున్నారు.
ఆ మధ్యన ఏపీలో వరదలు వచ్చాయి. అమరావతి మునిగి పోయే దాకా వచ్చింది. ఈ తరుణంలో తనతో పాటు కుటుంబ సభ్యులంతా పెట్టే బేడా సర్దుకుని హైదరాబాద్ కు వచ్చేశారు. ఇక్కడి నుంచి ఏపీలో పాలన సాగించారు. ఇది మరిచి పోయినట్టున్నారు చంద్రబాబు. ప్రస్తుతం తన శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో తనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తన వారిని మెల మెల్లగా ఇక్కడ ప్రధాన పోస్టులలో నియమించేందుకు ప్లాన్ చేశాడు. అది వర్కవుట్ అవుతోంది. ప్రధాన సలహాదారుగా మాజీ సీఎస్ ఆదిత్యా నాథ్ దాస్ ను నియమించారు. తన గురించి హరీశ్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
చంద్రబాబు అనే దేవుడికి రేవంత్ రెడ్డి అనే భక్తుడికి అంబికా దర్బార్ బత్తి లాంటోడు ఈ ఆదిత్యా నాథ్ దాస్ అంటూ నిప్పులు చెరిగారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ప్రజల డబ్బులను అప్పనంగా ఏపీకి చెందిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేయడం దారుణం.