మోదీ స్కూల్లో చ‌దువుకున్నా – సీఎం

రాహుల్ గాంధీ వ‌ద్ద ప‌ని చేస్తున్నా

హైద‌రాబాద్ – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆస‌క్ల‌కిర వ్యాఖ్య‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ రాసిన పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. ప్ర‌ధాన‌మంత్రి మోదీ స్కూల్ లో తాను మొద‌ట చ‌దువుకున్నాన‌ని అన్నారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు కాలేజీని పూర్తి చేశాన‌ని, ఆ త‌ర్వాత రాహుల్ గాంధీ కంపెనీలో ప్ర‌స్తుతం ఉద్యోగం చేస్తున్నాన‌ని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయ‌న చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

ఈ సంద‌ర్బంగా బండారు ద‌త్తాత్రేయ‌ను ప్ర‌శంసించారు. ఆయ‌నకు అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో స‌త్ సంబంధాలు ఉన్నాయ‌ని అన్నారు. వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి క‌ల్మ‌షం లేని నేత అంటూ పేర్కొన్నారు ఎ. రేవంత్ రెడ్డి. రాజ‌కీయాల‌లో ఎవ‌రు ఏ పార్టీలో ఉంటార‌నేది ఎవ‌రూ చెప్ప‌లేర‌న్నారు. గ‌తంలో కంటే ఇప్పుడు మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయ‌ని చెప్పారు సీఎం.

ఇక వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఎవ‌రితో, ఏ నాయ‌కుడితో వైరం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఒక్క‌రితో స్నేహ పూర్వ‌క‌మైన బంధం ఉంద‌న్నారు. తాను ప్ర‌తి ఒక్క‌రితో స్నేహాన్ని ఆశిస్తాన‌ని పేర్కొన్నారు ఎ. రేవంత్ రెడ్డి. త‌న‌కంటూ ముందు నుంచీ ఓ క‌ల ఉంద‌ని, అది ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిని కావ‌డ‌మేన‌ని అన్నారు. తాను ఒక్క‌సారి క‌మిట్ అయ్యానంటే వెన‌క్కి తిరిగి చూసుకోవ‌డం త‌న ఇంటా వంటా లేద‌న్నారు ముఖ్య‌మంత్రి. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ పేరుతో దోపిడీ త‌ప్ప జ‌రిగింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com