యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రస్తుతం భారత దేశం తరపున టి20 ఫార్మాట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. తాజాగా తన నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. తను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో జూన్ 8వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. పొలిటికల్ లీడర్ గా గుర్తింపు పొందిన ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం చేసుకోనున్నాడు.
ప్రియా సరోజ్ ఎవరో కాదూ ఉత్తర ప్రదేశ్ లోని సమాజ్ వాది పార్టీకి చెందిన నాయకురాలు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించాడు. అయితే తన జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండానే నిష్క్రమించింది మెగా టోర్నీ నుండి. రింకూ సింగ్, ప్రియా సరోజ్ యూపీలోని లక్నోలో ఓ పేరు పొందిన హొటల్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటారని కుటుంబీకులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ ఇద్దరు గత కొంత కాలం నుంచి టచ్ లో ఉన్నారని, వీరు త్వరలోనే ఒక్కటి కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవాళ కీలక అప్ డేట్ వచ్చింది రింకూ సింగ్ తరపు నుంచి. అధికారికంగా తామిద్దరం నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలిపాడు.