ఎయిర్ ఇండియా విమానాల్లో చాలా సంవత్సరాలుగా సమస్యలు ఉంటున్నాయన్న మాజీ ఉద్యోగి కామెంట్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు ఎయిర్ ఇండియాపై. తాను ఇంకెప్పుడూ జర్నీ చేయనంటూ పేర్కొన్నాడు. ఎయిర్లైన్ భద్రతా ప్రమాణాలను విమర్శించాడు. తనకు గతంలో జరిగిన అనుభవాలను ఈ సందర్బంగా ప్రస్తావించాడు. ప్రతికూల అనుభవాన్ని పంచుకున్నాడు.
ఇదిలా ఉండగా అనుభవజ్ఞులైన పైలట్లు కెప్టెన్ సుమీత్ సభర్వాల్ , ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ నేతృత్వంలోని విమానం వారి మధ్య 9,300 కంటే ఎక్కువ విమాన గంటలు గడిపింది. నైపుణ్యం ఉన్నప్పటికీ, ఈ ప్రమాదం ఎయిర్లైన్ కార్యాచరణ భద్రతా ప్రోటోకాల్లు, విమాన నిర్వహణ , మొత్తం సంక్షోభ ప్రతిస్పందన గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ తరుణంలో స్టార్ క్రికెటర్ వార్నర్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. భారత దేశంలో టాటా గ్రూప్ సంస్థకు మంచి పేరుంది. కానీ రతన్ టాటా ఉన్నప్పుడులా లేదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రస్తుతం సదరు సంస్థలకు చైర్మన్ గా ఎన్. చంద్రశేఖరన్ వ్యవహరిస్తున్నారు. విమాన ప్రమాద ఘటనపై స్పందించారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి ఇస్తామని ప్రకటించారు. కానీ పోయిన ప్రాణాలను తిరిగి తీసుకు రాలేరన్న సోయి ఉంటే మంచిది. మొత్తంగా స్టార్ ప్లేయర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఎయిర్ ఇండియా పనితీరును శంకిస్తున్నాయి. ఇప్పటికే డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని, వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.