డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. తను ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ పేరుతో న్యూ మూవీ తీస్తున్నాడు. తను త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. గత ఏడాది తను సూపర్ హిట్ మూవీ తీశాడు. అదే యానిమల్. ఇందులో రష్మిక మందన్నా కీ రోల్ పోషించగా త్రిప్తి దిమ్రీ మరో పాత్రలో జీవించింది.
ఈ తరుణంలో యానిమల్ తర్వాత ఎవరితో కొత్త ప్రాజెక్టు చేస్తాడనే దానికి తెర దించాడు. తాను ప్రభాస్ తో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇది పూర్తిగా పాన్ ఇండియా లెవల్లో తీస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి కీలక వ్యాఖ్యలు చేశాడు దీపికా పదుకొనే గురించి. ఎందుకంటే ముందుగా స్పిరిట్ లో ప్రభాస్ సరసన దీపికా పొదుకొనేను తీసుకోవాలని అనుకున్నాడు.
కానీ ఏమైందో ఏమో కానీ దీపికా పదుకొనేను పక్కన పెట్టేశాడు. తనకు బదులు త్రిప్తి దిమ్రీని లాక్ చేసినట్లు వెల్లడించాడు వంగా సందీప్ రెడ్డి. తను రూ. 20 కోట్లకు పైగా పారితోషకం డిమాండ్ చేసిందని, చివరకు రూ. 4 కోట్లకు త్రిప్తితో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ఈ సందర్బంగా దీపికా పదుకొనేపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వంగా సందీప్ రెడ్డి. తనదంతా ప్రచారం కోసం తప్పితే పస లేదంటూ పేర్కొన్నాడు. చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై సీరియస్ గా స్పందించింది బాలీవుడ్ నటి. తాను జీవితంలో బ్యాలెన్స్ డ్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేసింది. జీవితంలో ప్రతికూలత ఎదురైనప్పుడు తాను తన ఆత్మ చెప్పేది వింటానంటూ పేర్కొంది. తను చేసిన తాజా కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.