ఐపీఎల్ 2025లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి దాకా ప్లే ఆఫ్స్ కు చేరుకున్నామని తెగ ముచ్చట పడిన జట్లకు చివరి ప్రయత్నంలో మాత్రం కోలుకోలేని షాక్ కు గురవుతున్నాయి. దీనికి కారణంగా మొన్నటికి మొన్న గుజరాత్ టైటాన్స్ ను దెబ్బ కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇదే సమయంలో తాజాగా జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో వరుస విజయాలతో దూసుకు పోయిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు ఝలక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్.
పోతూ పోతూ ప్లే ఆఫ్స్ లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సైతం గట్టి దెబ్బ పడింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి . తాజాగా పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లింది ఢిల్లీ. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే 19.3 ఓవర్లలో 108 పరుగులు చేసింది నాలుగు వికెట్లు కోల్పోయి.
ముందుగా బ్యాటింగ్ చేసింది పంజాబ్. కెప్టెన్ అయ్యర్ మరోసారి సత్తా చాటాడు. 24 బంతుల్లో 54 రన్స్ చేశాడు. స్టాయినిస్ 16 బంతుల్లో 44 రన్స్ కొట్టాడు. ఇందులో 3 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు రాహుల్ 35 రన్స్ చేస్తే డుప్లెసిస్ 23 పరుగులు చేశాడు.