ఇండియన్ రాక్ స్టార్ గా గుర్తింపు పొందాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. తను ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించాడు. కొన్ని సినిమాలు తన వల్లనే ఆడాయి కూడా. ఇది పక్కన పెడితే ఆ మధ్యన పుష్ప -2 ఈవెంట్ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ప్రతి మూవీని బిగ్ సక్సెస్ కావాలని అనుకుంటామని, అలాగే కష్టపడి మ్యూజిక్ ఇస్తామన్నాడు. కానీ కొందరు నిర్మాతలు పని చేయించుకుంటారు కానీ పైసలు ఇచ్చేందుకు నానా ఇబ్బందులకు గురి చేస్తాడని బాంబు పేల్చారు. దీంతో సినీ ఇండస్ట్రీలో డీఎస్పీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చివరకు నిర్మాతలు సైతం తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఈ ఏడాది తను మ్యూజిక్ అందించిన సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ఒకటి తండేల్ మూవీ కాగా ఇంకొకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తొలిసారిగా మ్యూజిక్ అందించిన కుబేర. ఈ రెండూ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రధానంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మ్యాజిక్ చేసిందని చెప్పక తప్పదు. తాజాగా కుబేర మూవీ సక్సెస్ మీట్ కు ప్రత్యేకంగా హాజరయ్యాడు దేవిశ్రీ. తాను ఇంత త్వరగా డబ్బులు నిర్మాత ఇస్తాడని అనుకోలేదన్నాడు. దీంతో తాను ఊపిరి పీల్చుకున్నానన్నంటూ పేర్కొన్నాడు.
ఈ సందర్బంగా ప్రశంసలు కురిపించాడు వారిపై. థియేటర్ లో కుబేర రిలీజ్ కాక ముందే తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ ను ఇచ్చారని చెప్పాడు . ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపాడు. చిత్ర నిర్మాత ఆసియన్ సునీల్ కు థ్యాంక్స్ అంటూ పేర్కొన్నాడు దేవిశ్రీ ప్రసాద్. గతంలో తాను చేసిన సినిమాలకు ఇలా జరగలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు మరోసారి.
ఆసియన్ సినిమాస్ తాను పని చేసిన అత్యుత్తమ నిర్మాణాలలో ఒకటి అన్నాడు. ఎందుకంటే వారు సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ తో పని లేకుండా విడుదలకు ముందే నాకు రావాల్సిన బకాయిలు చెల్లించారని పేర్కొన్నాడు. ఈ సినిమా బిగ్ సక్సెస్ అయినందుకు, తనకు డబ్బులు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నాడు.