టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మధ్యన గతంలో విజయవంతమైన సినిమాలు రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు నటించిన ఖలేజా, అతడు ప్రేక్షకుల ముందుకు రాగా ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య మూవీ కూడా రిలీజ్ అయ్యింది. ప్రేక్షకులు ఆదరిస్తుండడం విశేషం. గతంలో రిలీజ్ అయి మిశ్రమ స్పందన వచ్చిన చిత్రం ఖలేజా రీ రిలీజ్ అయి కాసులు కొల్లగొడుతోంది. ఇది సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
తాజాగా మరో కీలక అప్ డేట్ వచ్చింది. మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడిగా పేరు పొందిన శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ ఢీ . పూర్తిగా నవ్వులు పూయించింది. ఇంటిల్లిపాదిని నవ్వించింది. కాసులు కురిపించేలా చేసింది. ఇందులో కీలక పాత్రలు పోషించారు మంచు విష్ణుతో పాటు జెనీలియా. ఇందులో చంద్రమోహన్ తండ్రి పాత్రలో ఇమిడి పోగా చారి పాత్రలో పర్ ఫార్మెన్స్ అదరగొట్టాడు బ్రహ్మానందం. ఇక రౌడీగా తండ్రి పాత్రలో దివంగత స్టార్ హీరో శ్రీహరి నటించాడు.
ఈ ఢీ చిత్రం 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ సక్సెస్ అయ్యింది. మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. విజయవంతమై నవ్వులు పండించిన ఢీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 6న శుక్రవారం తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. సో మరోసారి సినిమాను చూసేందుకు రెడీ కండి. ఇంకెందుకు ఆలస్యం.