తమిళల చలన చిత్ర దర్శకుడు అట్లీ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో పేరు పొందిన విశ్వ విద్యాలయం సత్య బామ యూనివర్శిటీ తనకు డాక్టరేట్ కు ఎంపిక చేసింది. ఈ సందర్బంగా జరిగిన స్నాతకోత్సవం కార్యక్రమంలో దర్శకుడు డాక్టరేట్ పత్రాన్ని అందుకున్నారు. కోలీవుడ్ లో చాలా కష్టపడి పైకి వచ్చాడు అట్లీ. తను తీసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ అన్నీ బిగ్ హిట్ అయ్యాయి. అంతే కాదు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తను దళపతి విజయ్ తో తీసిన బిగిల్, మెర్సిల్ సెన్సేషన్. ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఓ పేరు తీసుకు వచ్చేలా చేశాయి.
దీంతో మనోడు ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో డైరెక్టర్ గా మారి పోయాడు. ఆ తర్వాత తనను ఏరికోరి ఎంచుకున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్. తనతో జవాన్ మూవీ తీశాడు. ఇది 2023లో రిలీజ్ అయ్యింది. బాద్ షా సినీ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. ఏకంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టింది. ఇందులో విజయ్ సేతుపతిని హిందీలోకి తీసుకు వెళ్లాడు. ప్రస్తుతం ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో హాలీవుడ్ రేంజ్ లో మూవీ తీస్తున్నాడు. ఈ ఒక్క మూవీని సన్ పిక్చర్స్ ఏకంగా రూ. 850 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.
ఇదిలా ఉండగా సినీ రంగానికి విశిష్ట సేవలందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు తోడ్పాటు అందిస్తుండడంతో దర్శకుడు అట్లీ కుమార్ ను ఏరికోరి ఎంపిక చేసింది డాక్టరేట్ ఇచ్చేందుకు సత్యబామ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ. 34వ స్నాతకోత్సవంలో 5 వేల మందికి పైగా వివిధ విభాగాలలో కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేసింది. ఈ సందర్బంగా అట్లీ మాట్లాడాడు. కథ చెప్పడం అనేది తెరలను అధిగమించి, ఆకాంక్షలను రూపొందిస్తుంది. సృజనాత్మకతను రేకెత్తిస్తుందని అన్నాడు.