కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందాడు అట్లీ కుమార్. తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేశాడు. అద్బుతమైన సినిమాలు తీశాడు. ప్రతి చిత్రం విజయవంతంగా నడించింది. ఆ మధ్యన బాద్ షా తో జవాన్ తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 1000 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఇండియన్ హిస్టరీలోనే అత్యధిక పారితోషకం తీసుకునే దర్శకుడిగా తను టాప్ లో ఉన్నాడు. తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తను ఇండియన్ ఐకాన్ స్టార్ తో తీయబోయే మూవీ కోసం ఏకంగా రూ. 150 కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటున్నట్లు వినికిడి.
సన్ పిక్చర్స్ యజమాని దయానిధి మారన్ బంపర్ ఆఫర్ ఇచ్చాడని హీరోకు, తనకు కలిపి రూ. 350 కోట్లకు పైగానే చెల్లిస్తున్నాడని, మూవీ కోసం మరో రూ. 850 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే భారతీయ సినీ చరిత్రలో ఇంత భారీ బడ్జెట్ తో తీయబోయే తొలి చిత్రం కాబోతోందన్నమాట. ఇప్పటికే బన్నీతో పాటు దీపికా పదుకొనేకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశాడు. హాలీవుడ్ ను మరిపించేలా ఉన్నాయి.
ఇక తనపై తాజాగా అట్లీ కుమార్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ కొనసాగుతోంది. తను కాపీ మాస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించాడు స్టార్ డైరెక్టర్. తాను దేనిని కాపీ కొట్టాల్సిన అవసరం తనకు లేదన్నాడు. తాను తీసిన ప్రతి మూవీ నిజ జీవితంలోంచి వచ్చిందేనని, అందుకే పాత్రలు భిన్నంగా ఉంటాయన్నాడు.
అయితే తను మొదట రాజు రాణి తీశాడు. అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత తెరి, మెర్సల్, విజిల్ , జవాన్ తీశాడు. అన్నీ బ్లాక్ బస్టరే. ఇక తనకు హెవీ డిమాండ్ పెరిగి పోయింది. దీంతో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఒక స్థాయికి వచ్చాక ట్రోల్స్ మామూలేనంటూ పేర్కొంటున్నాడు. బన్నీతో తీసే సినిమాతో రికార్డుల మోత మోగించాలని, తనపై విమర్శలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు అట్లీ.