భారత దేశ సినీ రంగంలో అత్యంత జనాదరణ కలిగిన ఏకైక దర్శకుడు మణిరత్నం. తను తీసిన ప్రతి సినిమా ఓ క్లాసిక్. వర్ధమాన కళాకారులకు, టెక్నిషియన్లకు ఆయన ఓ పాఠం అని చెప్పక తప్పదు. అప్పట్లో మూస ధోరణిలో కొనసాగుతూ వస్తున్న సినిమాలకు భిన్నంగా తను అద్భుతమైన ప్రేమ కథను తెరకెక్కించాడు అదే రోజా. దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇళయరాజా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా చేసింది. ఒకప్పుడు కీ బోర్డు వాయించిన అల్లా రఖా రెహమాన్ అలియాస్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన స్వరాలు సమకూర్చాడు.
ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశాడు. ముంబై ఓ ప్రేమ కావ్యం. ముంబై మాఫియా నేపథ్యంతో సాగిన చిత్రం నాయకుడు. ఇందులో కమల్ హాసన్ నటన నభూతో నభవిష్యత్. ఆ తర్వాత వచ్చిన ప్రతి మూవీ జనాలను పిచ్చెక్కించేలా చేసింది. ఈ తరుణంలో తాజాగా మణిరత్నం చేతుల్లోంచి జాలువారిన చిత్రం థగ్ లైఫ్. దీనిని జూన్ 5న విడుదల చేయనున్నారు. ఇలయ నాయగన్ కమల్ హాసన్ తో పాటు సిలాంబరసన్, త్రిష కృష్ణన్ , అభిరామి కీలక పాత్రలలో నటించారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు భారీ ఎత్తున ఆదరణ లభించింది. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు కథను సమకూర్చాడు కమల్ హాసన్. అంతే కాకుండా ఆకట్టుకునేలా పాటకు సాహిత్యం కూర్చాడు. సోషల్ మీడియాను ఊపేస్తోంది. మణిరత్నం, కమల్ కాంబినేషన్ లో 38 ఏళ్ల తర్వాత వచ్చిన చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి థగ్ లైఫ్ పై.