ఎట్టకేలకు ప్రభాస్ నటించిన రాజా సాబ్ టీజర్ విడుదలైంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దుమ్ము రేపుతోంది. మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీ తర్వాత లవర్ బాయ్ అవతారం ఎత్తాడు. ఇక టీజర్ కెవ్వు కేక అనిపించేలా ఉందంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. దర్శకుడు మారుతి డిసెంబర్ 5న పిక్చర్ ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో మార్కెట్ లో మరింత బజ్ వచ్చేసింది.
ఇప్పటికే ప్రభాస్ నటించిన కల్కి సూపర్ హిట్ అయ్యింది. రూ. 1000 కోట్లు కొల్లగొట్టింది. దీంతో నిర్మాత అశ్వని దత్ సీక్వెల్ తీయడంపై ఫోకస్ పెట్టాడు. ఆల్ రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు నాగ్ అశ్విన్. ఇదే సమయంలో డార్లింగ్ ఫుల్ బిజీగా మారి పోయాడు. హనుమ రాఘవపూడితో జత కట్టాడు. వంగా సందీప్ రెడ్డితో స్పిరిట్ మూవీలో నటిస్తున్నాడు. అంత లోపు రాజా సాబ్ ను అయి పోగొట్టాలని డిసైడ్ అయ్యాడు. ఈ సందర్బంగా రాజా సాబ్ పై స్పందించాడు దర్శకుడు మారుతి.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. విశ్వప్రసాద్ ఇటీవలే నిర్మించిన మాస్ మహారాజా నటించిన మిస్టర్ బచ్చన్ బోల్తా పడింది. దీనికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ తో సినిమా తీయడం అన్నది తన కల అని, దానిని నిజం చేశాడంటూ ప్రశంసలు కురిపించాడు దర్శకుడు మారుతి. తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు.