Popular Director Rajamouli :ద‌ర్శ‌క ధీరుడు జ‌క్క‌న్న కామెంట్స్ వైర‌ల్

పోస్టుల విష‌యంలో సంయ‌మ‌నం పాటించాలి

Rajamouli : భార‌త్ , పాకిస్తాన్ దేశాల మ‌ధ్య యుద్ద వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. జ‌మ్మూ కాశ్మీర్ లోని పెహ‌ల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణా ర‌హితంగా ప‌ర్యాట‌కుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. 26 మందికి పైగా ప్రాణాల‌ను తీశారు. ఈ ఘ‌ట‌నతో ఒక్క‌సారిగా కేంద్రం సీరియ‌స్ గా తీసుకుంది. ఇది మంచి ప‌ద్ద‌తి కాదంటూ పాకిస్తాన్ కు హిత‌వు ప‌లికింది. అయినా త‌న తీరు మార్చు కోలేదు. దీంతో దాడుల‌కు తెగ‌బ‌డింది. దాయాది దేశం క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది.

Rajamouli Comments Viral

ఈ త‌రుణంలో యావ‌త్ భార‌త దేశం మొత్తం మోదీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిలిచింది. పెద్ద ఎత్తున దాడుల‌ను తిప్పి కొట్టింది. ఈ స‌మ‌యంలో ఇండియాకు చెందిన సినీ రంగం న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, సాంకేతిక నిపుణులంతా పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను స్వాగ‌తించారు. పూర్తిగా సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ సమ‌యంలో ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి(Rajamouli) తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ దాడుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పి కొడుతోంది భార‌త్. త్రివిధ ద‌ళాలు పెద్ద ఎత్తున పోటీ ఇస్తున్నాయి.

దీనిపై స్పందించిన జ‌క్క‌న్న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త ఆర్మీకి సంబంధించి ఏమైనా మీరు చూసినా లేదా విన్నా వాటిని ద‌య‌చేసి రికార్డ్ చేయొద్ద‌ని, పోస్టులు చేయొద్ద‌ని, షేర్ చేయ‌డాన్ని పుల్ స్టాప్ పెట్టాల‌ని కోరాడు ఎస్ఎస్ రాజ‌మౌళి. వాస్త‌వాల‌ను బ‌య‌ట‌కు తెలియ చేయ‌డం వ‌ల్ల‌, షేర్ చేయ‌డం వ‌ల్ల మేలు కంటే భార‌త్ కు తీవ్ర న‌ష్టం క‌లిగించే ఛాన్స్ ఉంద‌న్నారు. ఒక ర‌కంగా శ‌త్రువుల‌కు మ‌రింత బ‌లం చేకూర్చేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు.

Also Read : Natural Star-Hit 4 :ఫుల్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా హిట్ 4

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com