శ్రీ‌వారిని స‌న్నిధిలో డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌

అత్యంత సామాన్యుడిగా స్వామి ద‌ర్శ‌నం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం, కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా ప్ర‌సిద్ది పొందిన కోట్లాది భ‌క్తుల‌ను క‌లిగిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని మంగ‌ళ‌వారం ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శించుకున్నారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా సామాన్య భ‌క్తుడిలా ఆయ‌న ద‌ర్శించుకున్నారు. శ్రీవారి ఆల‌య ప్రాంగ‌ణంలో శేఖ‌ర్ క‌మ్ముల‌ను చూసిన భ‌క్తులు విస్మ‌యానికి గుర‌య్యారు. ఇంత సింపుల్ గా ఎలా ఉంటార‌ని విస్తు పోయారు.

చాలా మంది త‌న‌ను క‌లిసేందుకు పోటీ ప‌డ్డారు. అంద‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ ముందుకు వెళ్లి పోయారు. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది త‌న‌కు మ‌రిచి పోలేని జ్ఞాప‌కంగా మిగిలి పోయింది త‌ను తీసిన మూవీ కుబేర‌. జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చిన్న పాయింట్ ను తీసుకుని సూప‌ర్ స‌క్సెస్ సినిమా తీశాడు. ఇందులో యాచ‌కుడి, ధ‌న‌వంతుడి మ‌ధ్య జ‌రిగే క‌థ‌ను హృద్యంగా తెర‌పై తీర్చిదిద్ద‌డంలో స‌క్సెస్ అయ్యాడు శేఖ‌ర్ క‌మ్ముల‌.

త‌న సినీ కెరీర్ లో ప్ర‌తి సినిమా ఓ క్లాసిక్. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి గుర్తింపు పొంద‌ని క‌ళాకారుల‌తో సినిమాలు తీస్తూ వ‌చ్చాడు. కానీ ఈసారి త‌న సినీ ప్ర‌స్థానంలో టాప్ హీరోలు, హీరోయిన్ ను పెట్టి తీశాడు. ప్ర‌త్యేకించి ఇందులో ధ‌నుష్ న‌టించిన భిక్ష‌గాడి పాత్ర‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. త‌న‌తో పాటు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌తో పాటు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కీ రోల్స్ పోషించారు. దీనికి ప్రాణం పెట్టి తీశాడు ద‌ర్శ‌కుడు. త‌ను ప‌డిన క‌ష్టం ఫ‌లించింది. బిగ్ స‌క్సెస్ సాధించింది. ఏకంగా రూ. 50 కోట్ల క్ల‌బ్ లోకి ప్ర‌వేశించింది. సినిమా విజ‌య‌వంతం కావ‌డం, పాజిటివ్ టాక్ తో దూసుకు పోవ‌డంతో సంతోషం వ్య‌క్తం చేశారు శేఖ‌ర్ క‌మ్ముల‌.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com