అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో నిర్ణయంతో కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే కీలక నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అయినా ట్రంప్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఆయా దేశాలపై సుంకాలు విధించారు. తాజాగా యుఎస్ లో అత్యధికంగా నివసిస్తున్న భారతీయులపై (ఎన్నారైలు) తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే జాబ్స్ లేక అల్లాడుతున్నారు. మరికొందరు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
ఈ తరుణంలో పుండు మీద కారం చల్లినట్లు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఎన్నారైలు తమ వారికి, లేదా తమ దేశానికి డబ్బులు పంపిస్తే వాటిపై పన్ను చెల్లించాల్సిందేనంటూ కుండ బద్దలు కొట్టాడు. దీంతో పెద్ద ఎత్తున పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మనకు వచ్చే ఆదాయంపై భారీగా గండి పడుతుంది.
ఈ ప్రబావం అమెరికాయేతర పౌరులపై చూపనుంది. దాదాపు నగదు బదిలీకి సంబంధించి 5 శాతం పన్ను విధించాలని ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ప్రతిపాదిత బిల్లు ప్రతినిధుల సభ ముందుకు తీసుకు రావాలని ఆదేశించారు ట్రంప్. విదేశీయులతో పాటు హెచ్ 1బీ, గ్రీన్ కార్డుదారులు బదిలీ చేసే నగదుపై ఈ ట్యాక్స్ పడనుంది. కాగా అమెరికా పౌరసత్వం స్వీకరించిన వారిపై ఈ పన్ను ఉండదని సమాచారం. కాగా ఆర్బీఐ లెక్కల ప్రకారం అమెరికా నుంచి ఇండియాకు 118.7 డాలర్లుగా ఉంది.