అమెరికా – ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఇరాన్. దానికి ధీటుగా జవాబు ఇస్తోంది. ఈ సమయంలో పుండు మీద కారం చల్లినట్లు ఇజ్రాయెల్ కు మద్దతుగా సంచలన ప్రకటన చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దాడులు చేపట్టేందుకు అమెరికా సైనిక దళాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టెహ్రాన్ దారికి వస్తే సరి లేక పోతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మధ్య ప్రాచ్యం పూర్తిగా ధ్వంసం అయ్యేందుకు సిద్దం కాబోతోంది. ఈ తరుణంలో ఇరాన్ ఎలాంటి ప్రకటన చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా కొలువు తీరాక తల తిక్కగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు వ్యతిరేకంగా, అమెరికా పరువు పోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇండియాతో వైరం పెట్టుకున్నారు. ఆపై పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. చివరకు సుంకాల విషయంలో వెనక్కి తగ్గారు. ఇదే సమయంలో తనకు మద్దతుగా నిలిచి, తన గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన టెస్లా చైర్మన్, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ తో వైరానికి దిగారు.
ఇదే సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని ఓ వైపు చెబుతూనే మరో వైపు ఇరాన్ ను బెదిరించేందుకు ప్రయత్నం చేయడం కలకలం రేపింది. దౌత్యం వహించేందుకు ఒప్పుకుంటూనే ఇంకో వైపు తాను కూడా యుద్దానికి దిగుతానంటూ ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులకు పాల్పడక ముందు 60 రోజుల గడువు ఇచ్చారని, ఆ డెడ్ లైన్ అయి పోయిందని, ఇక వార్ కంటిన్యూ చేయడమే మిగిలిందని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్.