భార‌త్ లో ఆపిల్ విస్త‌ర‌ణ వ‌ద్దు – ట్రంప్

ఆపిల్ సీఈఓ కుక్ కు స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త దేశానికి షాక్ ఇచ్చారు. ఆయ‌న ఆపిల్ సిఈఓ కుక్ ను ఉద్దేశించి ఇండియాలో ఎందుకు ఆపిల్ కంపెనీని విస్త‌రిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ఇక్క‌డ అన్ని అవ‌కాశాలు ఉన్న‌ప్పుడు ఇంకో దేశానికి ఎందుకు వెళ్లాలంటూ మండిప‌డ్డారు. ఇండియా అధిక సంకులాను విధిస్తోందంటూ ఆరోపించారు. భార‌త్ స్వ‌యంగా త‌న‌ను తాను నిర్వ‌హించే సామ‌ర్థ్యం క‌లిగి ఉంద‌న్నారు ట్రంప్.

ఆపిల్ కంపెనీ అమెరికాపై దృష్టి సారించాల‌ని సూచించారు కుక్ కు డొనాల్డ్ ట్రంప్. దోహాలో జరిగిన ఒక వ్యాపార కార్యక్రమంలో టిమ్ కుక్‌తో తనకు చిన్న సమస్య ఉందని అమెరికా అధ్యక్షుడు అన్నారు. నువ్వు 500 ల బిల‌య‌న్ల ఆదాయంతో ఉన్నావు. ఆపిల్ ను ఇండియాలో విస్త‌రించేందుకు ప్లాన్ చేశావ‌ని, తాను అక్క‌డ విస్త‌రించాల‌ని అనుకోవ‌డం లేద‌న్నారు.

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సుంకాలు విధించే దేశాల‌లో ఇండియా కూడా ఒక‌టి అని పేర్కొన్నారు ట్రంప్. ఇండియాలో ఆపిల్ వ‌స్తువుల‌ను అమ్మ‌డం చాలా క‌ష్గ‌మ‌ని, అందుకే అమెరికానే సేఫ్ అంటూ ఇక్క‌డే ఆపిల్ ను విస్త‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్ కుక్ కు. ఐ ఫోన్ లు, మాక్ బుక్ లు ప్ర‌పంచ వ్యాప్తంగా డిమాండ్ క‌లిగి ఉన్నాయ‌న్నారు. ఇందుకు కుక్ కు యుఎస్ కంటే బెస్ట్ కంట్రీ ఇంకొక‌టి ఉండ‌ద‌ని తాను అనుకోవ‌డం లేదన్నారు ట్రంప్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com