Hero Mahesh Babu-ED :సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు ఈడీ నోటీసులు

ఏప్రిల్ 27న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశం

Hero Mahesh Babu-ED

Mahesh Babu : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఝ‌ల‌క్ ఇచ్చింది. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మ‌నీ లాండ‌రింగ్ వ్య‌వ‌హారంలో త‌న పాత్ర ఉన్న‌ట్లు గుర్తించింది. ఏప్రిల్ 27న త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు నోటీసులు జారీ చేసింది. ఈడీ వ్య‌వ‌హారం టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపింది. దీనిపై ఇంకా స్పందించ లేదు న‌టుడు మహేష్ బాబు. ఇటీవ‌ల ద‌ర్యాప్తు సంస్థ ఏక‌కాలంలో మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన సాయి సూర్య డెవ‌ల‌ప‌ర్స్ , సురానా గ్రూప్ ల‌పై ఏక‌కాలంలో దాడులు చేప‌ట్టింది. భారీ ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు సోదాల‌లో తేలింది.

ED Serves Notices to Mahesh Babu

ఇదిలా ఉండ‌గా ఈ సంస్థ‌ల‌కు డ‌బ్బులు తీసుకుని మ‌హేష్ బాబు(Mahesh Babu) పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన‌ట్లు ఈడీ గుర్తించింది. ప్రాజెక్టుల క్యాంపెయిన్ కోసం రూ. 5.9 కోట్లు త‌న‌కు చెల్లించిన‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ విచార‌ణ‌లో వెల్ల‌డైన‌ట్లు స‌మాచారం. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై కూపీ లాగింది. చివ‌ర‌కు నోటీసులు జారీ చేసేంత దాకా వెళ్లింది. తీసుకున్న డ‌బ్బుల‌కు సంబంధించి రూ. 3.4 కోట్లు చెక్కుల ద్వారా, మ‌రో రూ. 2.5 కోట్లు న‌గ‌దు రూపంలో మ‌హేష్ బాబుకు ముట్టిన‌ట్లు ఈడీ పేర్కొన్న‌ట్లు తెలిసింది. న‌గ‌దు లావాదేవీల‌కు సంబంధించి ఇది మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగిందా అన్న కోణంలో ద‌ర్యాప్తు చేసేందుకు రెడీ అయ్యింది.

కాగా సాయి సూర్య డెవ‌ల‌ప‌ర్స్ య‌జ‌మాని స‌తీష్ గుప్తా, సురానా గ్రూప్ డైరెక్ట‌ర్ న‌రేంద్ర సురానా కొనుగోలుదారుల‌ను మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో తెలంగాణ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అనుమ‌తి లేకుండానే ప్లాట్లు విక్ర‌యించ‌డం, ఒకే ప్లాటును ప‌లువురికి అమ్మ‌డం, త‌ప్పుడు రిజిస్ట్రేష‌న్లు చేయించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.

Also Read : Singer Pravasthi Sensational Comment :కీర‌వాణి..చంద్ర‌బోస్..సునీత వేధించారు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com