గ‌ద్ద‌ర్ ఫిలిం అవార్డుల జాబితా వెల్ల‌డి

30 సినిమాల‌కు పుర‌స్కారాలు

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు గ‌ద్ద‌ర్ స్మార‌క నంది అవార్డుల‌ను ఖ‌రారు చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాను ఎంపిక క‌మిటీ వెల్ల‌డించింది. 2024 సంవ‌త్స‌రానికి అన్ని అవార్డుల‌ను స్ప‌ష్టం చేసింది. ఈ పుర‌స్కారాల‌ను 2014 నుంచి 2023 దాకా 30 మూవీస్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. ఎంపికైన ప్ర‌తి మూవీకి నాలుగు రంగాల‌లో హీరో, హీరోయిన్, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల‌కు అవార్డులు అందించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఆరు విభాగాల‌లో స్పెష‌ల్ అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డం విశేషం.

2014 సంవ‌త్స‌రానికి గాను ర‌న్ రాజా ర‌న్, పాఠ‌శాల‌, అల్లుడు శ్రీ‌ను, 2015లో రుద్ర‌మ‌దేవి, కంచె, శ్రీ‌మంతుడు, 2016లో శ‌త‌మానం భ‌వ‌తి, పెళ్లి చూపులు, జ‌న‌తా గ్యారేజ్, 2017లో బాహుబ‌లి -2, ఫిదా, ఘాజీ,
2018లో మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం, కేరాఫ్ కంచ‌ర పాలెం, 2019లో మ‌హ‌ర్షి, జెర్సీ, మ‌ల్లేషం, 2020లో అల వైకుంఠ‌పురంలో, క‌ల‌ర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ ను ఎంపిక చేసింది.
ఇక 2021లో ఆర్ఆర్ఆర్, అఖండ‌, ఉప్పెన‌, 2022లో సీతారామం, కార్తికేయ -2 , మేజ‌ర్ , 2023లో బ‌ల‌గం, హ‌నుమాన్, భ‌గ‌వంత్ కేస‌రి ఎంపిక‌య్యాయి.

స్పెష‌ల్ కేట‌గిరీ అవార్డుల‌లో ఎన్టీఆర్ నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డు నంద‌మూరి బాల‌కృష్ణ‌ను వ‌రించింది. పైడి జ‌య‌రాజ్ , ఫిల్మ్ అవార్డును మ‌ణిర‌త్నం, బీఎన్ రెడ్డి అవార్డు సుకుమార్ కు, నాగిరెడ్చి చ‌క్ర‌పాణి ఫిల్మ్ అవార్డు ను అట్లూరి పూర్ణ చంద‌ర్ రావు, కాంతారావ్ ఫిల్మ్ అవార్డును విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇచ్చారు. ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డును యుండ‌మూరి వీరేంద్ర నాథ్ ను ఖ‌రారు చేసింది జ్యూరీ. విజేతలంద‌రికీ జూన్ 14న జ‌రిగే ప్ర‌ధానోత్స‌వంలో అంద‌జేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com