తమిళ సినీ రంగంలో టాప్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్. తను కొంత కాలం గ్యాప్ తీసుకున్నాడు. సినిమా తీయాలంటే బడ్జెట్ బాగుండాలని, కానీ తాను తీసే సినిమాలు కొందరి నిర్మాతలకు నచ్చడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత తను దర్శకత్వం కంటే నటుడిగా బిజీ అయ్యాడు. వరుస మూవీస్ తో సంతకాలు చేస్తూ పోతున్నాడు. ఆయనకు హెవీ డిమాండ్ ఉంటోంది దర్శకుడిగా కంటే నటుడిగా.
తాజాగా గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు యుఫోరియా మూవీని. ఇందులో గౌతమ్ వాసుదేవ మీనన్ కీరోల్ పోషిస్తున్నాడు. ఇందుకు తన పాత్రను కూడా బయటకు చెప్పేశాడు. జయదేవ్ నాయర్ పాత్రలో కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. గుణ శేఖర్ అంటేనే టాప్ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకడు.
ఇక దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను గతంలో మహేష్ బాబుతో ఒక్కడు తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది అప్పట్లో. కొన్ని సినిమాలు చేసినా వర్కవుట్ కాలేదు. బన్నీ, అనుష్క శెట్టితో మూవీ తీశాడు. ఆశించిన స్థాయిలో ఆడలేదు. సమంత రుత్ ప్రభుతో శాకుంతలం తీశాడు. అది ఎత్తి పోయింది. ప్రస్తుతం విలక్షణ కథతో ముందుకు వస్తున్నాడు యుఫోరియాతో. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో మీనన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మంచి స్పందన లభిస్తోంది.