తమిళ చలన చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకడు అట్లీ కుమార్. తను ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడిగా మారి పోయాడు. షారుక్ ఖాన్ తో తీసిన జవాన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 1000 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. అందరినీ ఆశ్చర్య పోయేలా సన్ పిక్చర్స్ తో భారీ బడ్జెట్ తో మూవీకి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ మొదలు పెట్టకుండానే సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినీ మార్కెట్ లో కలకలం రేపుతోంది. ఏకంగా రూ. 1000 కోట్ల మార్క్ ను దాటేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిని హాలీవుడ్ రేంజ్ లో తీయబోతున్నట్లు ఇప్పటికే హింట్ ఇచ్చేశాడు అట్లీ కుమార్.
తన టేకింగ్, మేకింగ్ అనూహ్యంగా ఉంటుంది. తను ఇతర దర్శకుల కంటే భిన్నం. అందుకే ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా ఉండేలా చూస్తాడు. ఇందుకు సంబంధించిన తొలి వీడియోను ఓ రేంజ్ లో రిలీజ్ చేశాడు. అంది సంచలనం రేపింది. ఆ తర్వాత ఎవరు బన్నీతో జత కడతారనే సస్పెన్స్ కు తెర దించేశాడు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను ఎంపిక చేశాడు. తనతో కలిసి ఏం చేయబోతున్నాడో గ్లింప్స్ ను రిలీజ్ చేశాడు. ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. తను దీపికానేనా అన్న అనుమానం కలిగించేలా చిత్రీకరించాడు. దీనిని చూసిన వారంతా వావ్ అంటున్నారు.
ఇక సన్ పిక్చర్స్ యాజమాన్యం భారతీయ సినీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఏఏ22 చిత్రాన్ని నిర్మిస్తోందని వినికిడి. ఈ మూవీ బడ్జెట్ ఏకంగా రూ. 800 కోట్లకు పైగానే ఉంటుందట. ఇందులో రూ. 350 కోట్లు హీరో, దర్శకుడికే ముట్ట చెబుతున్నట్లు టాక్. ఏది ఏమైనా దీపికానా మజాకా అంటున్నారు చూసిన వారంతా.