పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ వేరు. టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. ఓ వైపు సోదరుడు చిరంజీవి 157 మూవీకి రెడీ అవుతుండగా రామ్ చరణ్ పెద్దితో ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ తరుణంలో ఈ ఏడాది తాను నటించిన భారీ సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్దం అయ్యాయి. ఇప్పటికే మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్ బిగ్ ప్లాన్స్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం సంచలన ప్రకటన చేశాడు. వాయిదా పడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ నటించిన చిత్రం హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ డిక్లేర్ చేశాడు.
ఈ మేరకు వచ్చే జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తామని వెల్లడించాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ సంబురాలలో మునిగి పోయారు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఫోబియా కనిపిస్తోంది. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన చేశారు మూవీ మేకర్స్. ఓజీ సినిమా కూడా కొంత గ్యాప్ తర్వాత రిలీజ్ చేస్తామని సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటి నుంచే దర్శక, నిర్మాతలు హరి హర వీరమల్లు మూవీకి సంబంధించి ప్రమోషన్స్ ను గ్లోబల్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేశారు. విచిత్రం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత పేరు పొందిన దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వేదికగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయాలని నిర్మాత ఎంఎం రత్నం ప్లాన్ చేసినట్లు టాక్.