పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరి హర వీరమల్లు మరోసారి వాయిదా పడింది. చిత్ర బృందం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపింది. వాస్తవానికి జూన్ 12న రిలీజ్ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. చివరకు బిగ్ షాక్ ఇచ్చారు పవన్ ఫ్యాన్స్ కు. ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. ఏమైందో ఏమో కానీ ముహూర్తం సరిగా పెట్టిలేనట్లు అనిపిస్తోంది. ఈ సినిమా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చారు.
దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం. ఆయనకు పవన్ కళ్యాణ్ కు మధ్య చాలా దగ్గరి బంధం ఉంది. ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి తాను దర్శకత్వం చేయలేనంటూ ప్రకటించి విస్మయ పరిచారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఎవరైనా పవర్ స్టార్ ఇమేజ్ , స్టామినాను చూసి సినిమా చేయాలని అనుకుంటాడు. కానీ ఎందుకనో తను వెళ్లి పోయాడు.
ఇదే సమయంలో పవర్ స్టార్ ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం, ఎన్నికలలో ప్రచారం చేయడంతో షూటింగ్ చేసేందుకు ఇబ్బంది ఏర్పడింది. ఇదే క్రమంలో ఎలాగో సినిమాను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు నిర్మాత రత్నం. క్రిష్ తప్పుకోవడం, షాక్ ఇవ్వడంతో తన సోదరుడి తనయుడు జ్యోతి కృష్ణను పెట్టి పూర్తి చేయించాడు ఎలాగో. కానీ పెట్టిన డబ్బులు రావాలిగా.
దీంతో విషయం గమనించిన పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు కోసం తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 11 కోట్లను తిరిగి నిర్మాత ఎంఎం రత్నంకు అందజేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది అందరినీ విస్తు పోయేలా చేసింది. ఇక హరి హర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇదిలా ఉండగా ట్రైలర్ తో పాటు విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్.