టాలీవుడ్ లో దమ్మున్నోడు దర్శకుడు హరీశ్ శంకర్. నాకో తిక్కుంది దానికో లెక్కుంది అన్న డైలాగ్ తో హోరెత్తించాడు. కొంత కాలం గ్యాప్ తో సినిమాలు లేని సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బూస్ట్ ఇచ్చాడు. అంతే కాదు తాను తీసిన గబ్బర్ సింగ్ రికార్డులను తిరగ రాసింది. ఆపై కాసుల వర్షం కురిపించింది. దర్శకత్వ పరంగా తనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత పవర్ స్టార్ తో మరో సినిమా కూడా ప్రకటించాడు. అదే ఉస్తాద్ భగత్ సింగ్.
ఇక దర్శకుడిగా, సంభాషణల రచయితగా మంచి పేరుంది హరీశ్ శంకర్ కు. ఈ మధ్యను తను తీసిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఇందులో కొత్త హీరోయిన్ ను పరిచయం చేశాడు. రవితేజతో జత కట్టిన భాగ్యశ్రీ బోర్సేకు బోలెడు ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తోంది కూడా. కింగ్ డమ్, రామ్ పోతినేనితో ఫుల్ బిజీగా మారింది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రౌడీ జనార్దన్ మూవీలో కీ రోల్ పోషిస్తోంది.
తాజాగా ఉస్తాద్ మూవీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు హరీశ్ శంకర్. చిట్ చాట్ సందర్బంగా తన మనసులోని మాటను బయట పెట్టాడు. గబ్బర్ సింగ్ మూవీ కంటే ఉస్తాద్ మూవీని తీస్తానని ప్రకటించాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు. పవర్ స్టార్, మెగా అభిమానులు మెచ్చుకునేలా ఉంటుందన్నాడు.