న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేధింపులు అనేవి ప్రతిచోటా ఉంటాయన్నారు. తనను కావాలని వేధించేందుకే ఏపీ నుంచి మధ్యప్రదేశ్ కోర్టుకు బదిలీ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ప్రస్తుతం దేశ న్యాయవ్యవస్థలో చోటు చేసుకున్న గ్యాప్ ను , ఒత్తిళ్లను, కక్ష సాధింపు చర్యలను, చిల్లర రాజకీయాలను మరోసారి బయట పెట్టింది. జస్టిస్ వెంకట రమణ ఆవేదన చెందారు. ఒకానొక దశలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మరాయి.
తను ఏనాడూ ఎవరికీ లొంగ లేదన్నారు వృత్తి పరంగా. ఇక్కడ కాక పోతే ఇంకెక్కడికైనా వెళ్లేందుకు తాను సిద్దమేనని ప్రకటించానని, తప్పు చేసే వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. గత 2023లో ఏపీలో న్యాయ విధులు నిర్వహిస్తున్న తనను కావాలని మధ్యప్రదేశ్ కు మార్చేశారని ఆరోపణలు చేశారు జస్టిస్ . ఇది పూర్తిగా తనను కలిచి వేసిందన్నారు. కానీ తాను తట్టుకుని ఇక్కడికి వచ్చానని చెప్పారు. తనను ఎంతగానో ఇంటి సభ్యుడిగా చూసుకున్నారని ప్రశంసలు కురిపించారు.
జీవితంలో ఆటు పోట్లు, ఒడిదుడుకులు ఉంటాయని చెప్పారు. ఇదిలా ఉంగా న్యాయమూర్తిగా జూన్ 2వ తేదీన తన పదవి నుంచి దిగి పోనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో కీలక వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే న్యాయవ్యవస్థలోని లొసుగుల గురించి బహిరంగంగా చర్చించుకునేలా చేసింది. మొత్తంగా జస్టిస్ ఆవేదన వెనుక ఎవరు ఉన్నారనేది తేల్చాల్సిన అవసరం ఉంది.