ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీకి కోపం వచ్చింది. తన గురించి లేనిపోని విమర్శలు చేస్తున్న వాళ్ల గురించి తీవ్రంగా స్పందించింది. తాను విమర్శలను పట్టించుకోనని పేర్కొంది. వాటి గురించి అంతగా ఆలోచించనని చెప్పింది. తాను జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటానని, దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడతానని తెలిపింది. తాను నటించిన మహారాణి, తర్లా సినిమాలు బిగ్ సక్సెస్ కావడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
గతంలో కొన్ని మంచి పాత్రలు దక్కాయని, ఇప్పుడు కేవలం సెలెక్టివ్ గా ఉండే కథలను మాత్రమే ఎంచుకుంటున్నట్లు హుమా ఖురేషీ వెల్లడించింది. యు షుడ్ డూ యంగర్ పార్ట్స్ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. తను ఎల్ఎల్బీ 3, మహారాణి నాల్గవ సీజన్ కు రెడీ అవుతోంది. పరిణతి చెందిన పాత్రలను ఎంచుకుంటే మీ కెరీర్ బావుంటుందంటూ తనకు క్యాస్టింగ్ ఏజెంట్ సలహా ఇచ్చారని దానినే తాను పాటిస్తున్నట్లు చెప్పింది హుమా ఖురేషీ.
అయితే ఆయా మూవీస్ లో మహిళలకు సంబంధించిన పాత్రలు మరీ చిన్నవిగా ఉంటున్నాయని, అలా ఎందుకని ప్రశ్నించింది. తనకు మహారాణి, తర్లా, మౌనికా, ఓ మై డార్లింగ్, లీలా సినిమాలలో ఫుల్ స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయని, దీని వల్లనే అవి విజయం సాధించినట్లు తాను భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఇటీవల ఇండియా టుడే ఇండో యుఏఈ కాన్ క్లేవ్ లో జరిగిన ది మహారాణి ఆఫ్ రీ ఇన్వెన్షన్ కార్యక్రమంలో పాల్గొంది. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.