మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ -2025 షెడ్యూల్ రిలీజ్

ఫైన‌ల్ వేదిక బెంగ‌ళూరు లేదా శ్రీ‌లంక లోని కొలంబో

ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఏడాది మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి షెడ్యూల్ ను వెల్ల‌డించింది. భార‌త్, శ్రీ‌లంక వేదిక‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ లు , తేదీల‌ను ఖ‌రారు చేసింది. సెప్టెంబ‌ర్ 30 నుంచి న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు 5 వేదిక‌ల్లో జ‌ర‌గ‌నుంది ఈ మెగా టోర్న‌మెంట్. భార‌త మ‌హిళా జ‌ట్టు తొలి మ్యాచ్ సెప్టెంబ‌ర్ 30న బెంగ‌ళూరు వేదిక‌గా ఆడ‌నుంది.

విమెన్స్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ వ‌చ్చే న‌వంబ‌ర్ 2న ఫైన‌ల్ కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది ఇండియాలోని బెంగ‌ళూరు లేదా శ్రీ‌లంక‌లోని రాజ‌ధాని కొలంబోలో. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఫైన‌ల్ వేదిక‌ను ఖ‌రారు చేయ‌డం జ‌రుగుతుంద‌ని ఐసీసీ ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా మహిళల ప్రపంచ కప్‌కు భారతదేశం మొదట ప్రత్యేక ఆతిథ్య హక్కులను పొందింది. అయితే, BCCI , PCB మధ్య కొనసాగుతున్న ‘హైబ్రిడ్ మోడల్’ ఒప్పందం కారణంగా పాకిస్తాన్ ఇప్పుడు తన అన్ని మ్యాచ్‌లను శ్రీ‌లంక‌లో ఆడ‌నుంది. మొదట్లో ఎనిమిది జట్లు పాల్గొనే ఐసిసి మహిళల మెగా ఈవెంట్‌కు భారతదేశం ఏకైక ఆతిథ్యం ఇచ్చేది. కానీ ఇప్పుడు బెంగళూరు, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, శ్రీలంక రాజధాని అంతటా జరుగుతుంది.

ఫైనలిస్టులు డిసైడర్ కోసం సిద్ధం కావడానికి కనీసం రెండు రోజులు సమయం ఉంటుంది. నవంబర్ 2న బెంగళూరు లేదా కొలంబోలో టైటిల్ పోటీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. ఆతిథ్య భారతదేశంతో పాటు, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జ‌ట్లు ఈ మెగా టోర్నీలో పార్టిసిపేట్ చేస్తాయి. ఏడు సార్లు టైటిల్ ను గెలుచుకుంది ఆస్ట్రేలియా టీం. భార‌త్ ఈసారి స‌త్తా చాటాల‌ని చూస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com