కాల్పుల విర‌మ‌ణ ఆల‌స్యం పాకిస్తాన్ కు శాపం

స్వామి రాంభ‌ద్రాచార్య షాకింగ్ కామెంట్స్

ప్ర‌ముఖ ఆధ్యాత్మిక స్వామి రాం భ‌ద్రాచార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న దాయాది పాకిస్తాన్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కాల్పుల విరమణ ఆలస్యం అయితే భార‌త్ కంటే పాకిస్తాన్ కే తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌న్నారు. ఇది గుర్తించి ముందుకు వ‌స్తే మంచిద‌ని సూచ‌న చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌తిసారి భార‌త్ తో పాకిస్తాన్ క‌య్యానికి కాలు దువ్వుతోంద‌న్నారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ రెండు రోజులు ఆలస్యం అయితే, పాకిస్తాన్ “ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టుకుపోయేది” అని ఆయన నొక్కి చెప్పారు.

విరమణ విరమణ అవగాహన 1-2 రోజులు ఆలస్యం అయితే ఆ దేశానికి పుట్ట‌గ‌తులు అంటూ ఉండేవి కావ‌న్నారు రాం భ‌ద్రాచార్య‌. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భార‌త్ చేప‌ట్టిన ఆపరేషన్ సిందూర్ అద్భుతం అంటూ కొనియాడారు. ఈ సంద‌ర్భంగా భార‌త ఆర్మీని ప్ర‌త్యేకంగా అభినందించారు. అంతే కాదు ధైర్యంగా నిర్ణ‌యం తీసుకున్నందుకు మోదీని ప్ర‌శంసించారు స్వామీజి.

ఇటీవలే తాను సాయుధ దళాల ఉన్నతాధికారులతో సమావేశం కాడం జ‌రిగింద‌న్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను దేశం తిరిగి కోరుకుంటుందని వారితో చెప్పానని స్వామి రాంభద్రాచార్య చెప్పారు.
స‌నాత‌న‌ ధర్మం గురించి, దానిని వ్యతిరేకించే వారు నాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com