అందాల ముద్దుగుమ్మ ఇలియానా గురించి ఎంత చెప్పినా తక్కువే. తన సినీ కెరీర్ తెలుగు వారితో బంధం నెలకొంది. తన తొలి చిత్రం రామ్ పోతినేనితో తీసిన దేవదాస్ మళ్లీ పుట్టాడు మూవీలో నటించింది. తన అందం, అభినయంతో మెప్పించింది. ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ సినిమాకు మంచి రెస్సాన్స్ రావడం, పాటలు ఆకట్టుకునేలా ఉండడం, దర్శకుడి టేకింగ్, మేకింగ్ తో ఇలియానా అందరికీ ఇష్టమైన నటిగా మారి పోయింది.
ఇదే సమయంలో తనకు బంపర్ ఆఫర్ వచ్చింది డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపంలో. తనకు ఇలియానాకు అనుకోకుండా ఛాన్స్ ఇచ్చాడు. ప్రిన్స్ మహేష్ బాబుతో పోకిరి తీశాడు. టాలీవుడ్ హిస్టరీలో రికార్డుల మోత మోగించింది. అప్పటి దాకా కొన్ని పాత్రలకే పరిమితమైన ప్రిన్స్ మహేష్ బాబు ఈ ఒక్క మూవీతో దుమ్ము రేపాడు. కాసుల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ లను షేక్ చేసేలా చేసింది. తనకు స్టార్ డమ్ తీసుకు వచ్చేలా చేసింది. అదే సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అతడు చిత్రం సెన్సేషన్ గా నిలిచింది.
ఇలియానా ఆ తర్వాత ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన జల్సా చిత్రంలో కీ రోల్ పోషించింది. ఇది మ్యూజికల్ హిట్ గా నిలిచింది. నటికి మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో నటించిన కిక్ కిక్కించేలా చేసింది. దీనికి తెలంగాణకు చెందిన దర్శకుడు సురేందర్ రెడ్డి తీశాడు.
ఇది కామెడీ, రొమాంటిక్ మూడ్ కథాంశంతో తెరకెక్కించాడు. బిగ్ హిట్ గా నిలిచింది. హిందీ సినిమాలలో కూడా నటించింది. రైడ్ మూవీ తనకు పేరు తీసుకు వచ్చింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తను ప్రస్తుతం బిడ్డకు తల్లిగా మారింది. ఈ సమయంలో చిట్ చాట్ సందర్బంగా కొందరు తనను సంప్రదించారని, త్వరలోనే ఆలోచిస్తున్నానని పేర్కొంది.