మూడు నిమిషాల్లోనే పాక్ బంక‌ర్లు మ‌ట్టుబెట్టాం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఇండియ‌న్ ఆర్మీ

ఢిల్లీ – భార‌త ఆర్మీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. పాకిస్తాన్ ప‌దే ప‌దే క‌య్యానికి కాలు దువ్వితే చుక్క‌లు చూపించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని వెల్ల‌డించింది. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ద‌మై ఉన్నామ‌ని పేర్కొంది. త్రివిధ ద‌ళాలు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అవుతూ వ‌స్తున్నాయ‌ని, కానీ తాము చేస్తున్న దాడుల నుంచి త‌ప్పించుకునేందుకు పాకిస్తాన్ కు చేత కాలేద‌ని తెలిపింది.

కేవ‌లం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని 13 శ‌త్రు స్థావ‌రాల‌ను క్లోజ్ చేశామ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఉగ్ర‌వాదులు ప‌రుగులు తీశార‌ని, చాలా మంది ప్రాణాలు కోల్పోయార‌ని వెల్ల‌డించింది. ఉగ్ర‌వాదాన్ని , దానిని ప్రోత్స‌హిస్తున్న పాకిస్తాన్ ను లేపేస్తామ‌ని, తోక జాడిస్తే అంతు చూస్తామ‌ని వార్నింగ్ ఇచ్చింది ఇండియ‌న్ ఆర్మీ.

తాము పాకిస్తాన్ పై దాడి చేసిన ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి భార‌తీయ త్రివిధ ద‌ళాలు వీడియోల‌ను రిలీజ్ చేసింది. ఈ సంద‌ర్బంగా భార‌త్ ఎలా దాడుల‌కు పాల్ప‌డిందో క‌ళ్లకు క‌ట్టిన‌ట్లు చూపించింది. క‌లుగు, బంక‌ర్ల‌లో దాక్కున్న ఉగ్ర‌వాదుల‌ను కూడా ఏరి పారేశామ‌ని, భ‌యంతో బ‌తుకుతున్నార‌ని ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తే మాత్రం వెంటాడి చంపుతామ‌ని తెలిపింది. షోల్డ‌ర్ ఫైర్డ్ క్షిప‌ణులు, ఫిరంగులు మ‌ట్టు పెట్టామ‌ని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com